గురు పరంపర

  • జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య

  • అపర శంకరులు శ్రీ సచ్చిదానందేంద్ర

  • జ్ఞానమూర్తి శ్రీ అద్వైతానందేంద్ర

ధ్యానమూలం గురోర్ముర్తిః పూజామూలం గురోపదమ్। మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా॥

visistatha-img

విశాఖ శ్రీ శారదాపీఠం విశిష్టత

విశాఖ శ్రీ శారదాపీఠం ఆదిశంకరాచార్య సాంప్రదాయ అద్వైత పీఠం. తపో పీఠం. జ్ఞాన పీఠం. సిద్ధి పీఠం. సమాజంలో కాలానుగుణంగా ధర్మం నిర్వర్తించబడుతూ ఉండాలని తపిస్తుంది విశాఖ శ్రీ శారదాపీఠం. సనాతన ధర్మాన్ని ఆధునిక కాలానికి పునర్నిర్వర్తించే మహత్తర కార్యం భారతదేశంలో ఎవరైనా చేస్తున్నారంటే..అది విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారే. నిత్య నూతనమైన మానవ సమూహాలకు దిశా దర్శనం చేయిస్తున్న భారతీయ ధర్మం గంగా స్రోతస్వినిగా నిరంతరం ప్రవహింపజేయడానికి విశాఖ శ్రీ శారదాపీఠం అహర్నిశలు కృషి చేస్తోంది. భారతీయ తత్వాన్ని, భారతీయ సత్వాన్ని నేల నలుచెరగులా అనుక్షణం ప్రబోధం చేసేటటువంటి గొప్ప కార్యాన్ని పీఠం నిర్వహిస్తోంది.

పీఠం లో వుండే ఆలయాలు

దేవతామూర్తుల ఆరాధనలు, పీఠాధిపతుల అనుష్టానం, అక్షరాభ్యాసములు, శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అర్చనలు, వేద పాఠశాల నుంచి విన వచ్చే వేదఘోష....

5:15 AM

మహాస్వామి వారి అనుష్టానం

5:30 AM

వేద విద్యార్థుల ప్రాతఃకాల సంధ్యావందనం

6:00 AM

జేగంటల మధ్య తెరుచుకోనున్న విశాఖ శ్రీ శారదాపీఠం ముఖద్వారం, ఆలయాలు

6:10 AM

మహాస్వామి ఆలయాల సందర్శన

06:15 AM

చంద్రమౌళీశ్వరులకు ప్రాతఃకాల అర్చన

భారతీయ జీవన విధానం వేద సమ్మతం. వేద పరిరక్షణ విశాఖ శ్రీ శారదాపీఠం అభిమతం. ఏడాది పొడవునా పీఠం చేపట్టే వేదోక్తమైన, వైదికపరమైన కార్యక్రమాల సమాహారమిది.

విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్

చాతుర్మాస్య దీక్ష చేపట్టిన సందర్భంగా ఋషికేష్ లో గంగానదీ తీరాన వేద విద్యార్థులు, వేద పండితులతో పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదాపీఠం నూతన లోగోను ఆవిష్కరించిన పీఠాధిపతులు

శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి హారతులిస్తున్న పీఠాధిపతులు

బుద్ధి జీవుల్లో ఉండే కల్మషాన్ని, కశ్మలాన్ని, చీకటిని, ఆలోచనల్లో ఉండే అసమానతలను తొలగించి మానవుడిని ప్రేమమూర్తిగా తయారుచేసేవాడే గురువు. అలాంటి గురువులు ఈ సమాజానికి నిర్దేశకులు అవుతారు. మానవ జాతిని సన్మార్గంలో నడిపిస్తారు

నిరతం ధర్మపోరాటాలు, ధర్మప్రబోధాలు చేపట్టే చైతన్యమూర్తి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. భారతీయులంతా ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మప్రచారం చేయాలనేది గురువులు స్వరూపానందేంద్రుల సందేశం. ధర్మగ్లాని జరిగినపుడు శాస్త్రబద్ధమైన, విహితమైన సంప్రదాయాన్ని కాపాడాలి. శరీరం రాలిపోక ముందే ఇహంలోనే ఆత్మసాక్షాత్కారం కలగాలి. సర్వధర్మాలు పరమాత్ముని చేరడానికేనని శ్రీ చరణుల ఉపదేశం.

 vishaka-sree2

ఛాయాచిత్రాలు

పీఠం, పీఠాధిపతుల ఛాయాచిత్రాలు, దృశ్య మాలిక

మరింత విస్తృతంగా ...

సంప్రదించండి

మీకు సంబంధించిన సమాచారం వేరెవరికీ చేరదు. గోప్యంగా ఉంటుంది.